పాకిస్థాన్లో బందీగా ఉన్న సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను పాక్ ఆర్మీ శారీరకంగా వేధించనప్పటికీ. మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. అభినందన్ పాకిస్థాన్లో దాదాపు 60 గంటలు ఉన్నారు. ఆసమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ANI వార్తా ఏజెన్సీ వెల్లడించింది. అయితే. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అభినందన్ను గత బుధవారం పాక్ ఆర్మీ బంధించిన సంగతి తెలిసిందే. పీవోకేలో మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ అభినందన్ గాయాలతో బయటపడ్డాడు. ముందుగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేసినా తర్వాత పాక్ ఆర్మీ ఆయనను అదుపులోకి తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాల ఒత్తిడితో, జెనీవా ఒప్పందం ప్రకారం పాక్.. అభినందన్ను శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వాఘా బార్డర్ దగ్గర భారత్కు పాక్ అప్పగించింది.