కొండా దంప‌తుల కోసం KCR మెట్టు దిగారు

TRS అధిష్టానం పలువురికి బెర్త్ ఖరారు చేయక పెండింగ్ లో పెట్టడం. అందులో వరంగల్ తూర్పు నియోజకవర్గం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొండా సురేఖ సైతం ఉండటం,

టికెట్ ప్రకటించకపోవడంతో కొండా దంపతులు పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి: తమ అభ్యర్థిత్వం పెండింగ్ పెట్టడానికి గల కారణాలు తెలియచేయాలని – లేని పక్షంలో బహిరంగ లేఖ రాస్తామని హెచ్చరించడం తెలిసిన సంగతే. వీరి విషయంలో TRS పార్టీ అధినేత – సీఎం KCR ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కొండా దంపతుల కోసం కేసీఆర్ మెట్టుదిగినట్లు సమాచారం. దీంతో ఆమె సైతం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉందంటున్నారు…

సురేఖ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారంతో ఆమె సీటు పెండింగ్ లో పెట్టడానికి కారణమని చర్చ జరిగింది. అయితే అభ్యర్థుల ప్రకటన అనంతరం కారణాలు ఏవైనా TRS అధిష్టానం దుమ్మెత్తిపోసిన కొండా దంపతులు వేరే పార్టీలోకి జంప్ అవుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ సమయంలోనే KCR ఎంట్రీ ఇచ్చి ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్నారు.

కీలకమైన వరంగల్ జిల్లాలో సీట్లను కోల్పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. కొండా దంపతులు వరంగల్ తూర్పు• పశ్చిమ• పరకాల• భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రత్యక్షంగా• మరో మూడు నియోజకవర్గాలను పరోక్షంగా ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్సీ వర్గాలు గులాబీ దళపతికి నివేదికలు అందించినట్లు సమాచారం. దీనితో ఓ కీలక నేత రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా దంపతుల విషయంలో కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని – తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టపోతారని నచ్చచెప్పినట్లు సమాచారం.

మరోవైపు కేసీఆర్ సైతం కొండా మురళితో మాట్లాడినట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు మరో నియోజకవర్గంలో టికెట్ ఇచ్చే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని – ఒకవేళ రెండో టికెట్ ఇవ్వలేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్ ను తనకు వదిలేసి జిల్లాలో పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా దంపతులు పునరాలోచనలో పడినట్లు సమాచారం.