రీసైకిలబుల్ వేస్ట్ ను సేకరించడంలో మిగతా అందరికన్నా ముందు నిలిచాడు, తెలంగాణ సిఎం కెసిఆర్ మనవడు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు. డిహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన బెహతర్ ఇండియా క్యాంపెయిన్ పర్యావరణ విభాగంలో హిమాన్షురావు గోల్డ్ మెడల్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ ను హిమాన్షు సేకరించగా, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ మొత్తం 34,137 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ ను సేకరించి పాఠశాలల విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. గురువారం ఢిల్లీలో జరిగిన ‘బెహతర్ ఇండియా క్యాంపెయిన్’ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా, విజేతలకు పతకాలు ప్రదానం చేశారు. హిమాన్షును డిహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి అనూప్ పెబ్బీ హిమాన్షురావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తన కొడుకు సాధించిన బంగారు పతకం పై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.