జాతకంలో దోషముందని 4 ఏళ్లుగా అత్యాచారం

జాతకంలో దోషం ఉందంటూ ఓ యువతిపై ఆమె మేనమామ నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన దిల్లీలో బయటపడింది. ఆ దోషం సరి చేసుకోకపోతే తండ్రి చనిపోతాడని చెప్పి నిందితుడు బాధితురాలిని లొంగదీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేనకోడలు అని కూడా చూడకుండా 23 ఏళ్ల యువతిపై గత నాలుగేళ్లుగా లెక్కలేనన్ని సార్లు అత్యాచారం జరిపాడని వెల్లడించారు. యువతికి వివాహం జరిగాక కూడా నిందితుడు ఈ అఘాయిత్యాన్ని ఆపలేదు.

దీంతో విషయాన్ని యువతి తన బంధువులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అరెస్టు చేసిన నరేలా ప్రాంత పోలీసులు యువతిని దిల్లీలోని మహిళా సంరక్షణ గృహానికి తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.