ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే కనుమ రహదారిలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి లోయ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో చెట్టుకొమ్మలు, వృక్షాలు అడ్డుగా ఉండటంతో బస్సు రహదారి పిట్టగోడపై నిలిచిపోయింది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు కాస్త ముందుకు వెళ్లి ఉంటే మాత్రం పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు తెలిపారు.చెట్టుకొమ్మలే తమను కాపాడాయని.. పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.