పూనమ్ కౌర్ పాకిస్థాన్లోని ఆలయంలో పూజలు చేశారు. పాక్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయం శ్రీ కటస్ రాజ్ ఆలయంలో ఇటీవల పూనమ్ కౌర్ శివ పూజ చేశారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆలయంలో శివలింగానికి పూజలు చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.
ఈ ఆలయంలో పూజలు చేస్తానని కలలో కూడా అనుకోలేదని పూనమ్ పేర్కొన్నారు. పాకిస్థాన్, భారత్ ఒప్పందంలో భాగంగా ఇటీవల కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాక్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ను పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాను ఈ కారిడార్ కలుపుతుంది.
ఈ కారిడార్ ద్వారా మనదేశంలోని సిక్కులు పాక్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్కు చేరుకుంటారు. ఇప్పటి వరకూ కర్తార్పూర్ వెళ్లాలంటే లాహోర్ మీదుగా తిరిగి రావాల్సి వచ్చేది. ఇప్పుడు కారిడార్ అందుబాటులోకి రావడంతో నేరుగా అక్కడికి వెళ్లడం తేలికైంది. పూనమ్ కూడా ఇలానే అక్కడికి వెళ్లారు.