హైదరాబాద్: బాయ్‌ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్‌ చేస్తూ ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్‌. భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ 3వ సంవత్సరం చదువుతోంది. ఈ ఆదివారం తన బాయ్‌ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్‌ చేస్తూ హాస్టల్‌ రూములో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది భాగ్యలక్ష్మి.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల సరైన కారణాలు తెలియరావాల్సి ఉంది. భాగ్యలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పట్టణ ఎస్‌ఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ-2 దేవ సుధ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.