నిన్న జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడిలో 44 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ముష్కరుల దొంగ దెబ్బకు గట్టి గుణపాఠం చెప్పాలని నినదిస్తోంది. భారతీయులందరూ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిస్తున్నారు. ఈ దాడిలో బీహార్‌లోని బగల్‌పురాకు చెందిన రతన్ ఠాకూర్ అనే జవాన్ అమరుడయ్యారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలు/ యావత్ దేశాన్ని ?? కదిలిస్తున్నాయి. ‘‘మాతృభూమి సేవలో పెద్ద కొడుకును కోల్పోయాను.

ఇప్పుడు నా , రెండో బిడ్డను కూడా సరిహద్దుల్లో పోరాటానికి పంపుతాను. మాతృభూమి కోసం వాడిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పాకిస్థాన్‌కు మాత్రం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే’’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. NIA బృందం కూడా కశ్మీర్ చేరుకుని విచారణ ప్రారంభించింది. దుర్ఘటనకు బాధ్యత వహిస్తున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు భారత్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.