రేపు ఆటోలు ,క్యాబ్ లు బంద్ కొన్ని బ్యాంక్ లు కూడా

Advertisement

కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ అంతటా ఈనెల 8న మంగళవారం ఆటోలు, స్కూల్ వ్యాన్‌లు, క్యాబ్‌ల బంద్‌ పాటించనున్నట్లు ఆటో మోటార్ రంగ కార్మిక సంఘాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఎంవీ యాక్ట్‌ సవరణ బిల్లును బలవంతంగా రుద్దుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా 8న ఆటోల బంద్‌, 9న నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నేతలు  ప్రకటించారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ఫైనాన్సర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. దీనికి సంబందించి హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని AITUC కార్యాలయంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఆటో ప్రయాణాలపై ఆధారపడే ప్రయాణికులు ఆ రోజు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి ఉంటుంది కార్మిక సంఘాల నేతలు సూచించారు.

కొన్ని బ్యాంకులు కూడా బంద్

మంగళ, బుధవారాల్లో జరిగే బంద్లో కొన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (AIBEA), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఈ బంద్లో పాల్గొంటున్నట్లు తెలిపాయి. దీంతో ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది.