రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల మృతి

Advertisement

లంగర్‌హౌస్‌ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందారు. పిల్లర్‌ నంబర్‌ 102 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు మృతిచెందారు. మృతులను నానక్‌రామ్‌ గూడ టవర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసే దీపికా నిఖిల్‌, సయీద్‌ అహ్మద్‌ (32)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.