వరంగల్ మేయర్ ఎంపిక కోసం సీఎం కెసిఆర్ ఆదేశాలతో trs వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి . రామారావు గురువారం కసరత్తు ప్రారంభించారు . గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పరేషన్ పరిధి లోని ఐదుగురు శాసనసభ్యులు ,శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర రెడ్డి లతో అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే trslp కార్యాలయం లో కెటిఆర్ ప్రాథమిక చర్చలు జరిపారు .మేయర్ నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం తో కొత్త మేయర్ ఎంపిక అనివార్యమైంది .

Advertisement

వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు వినయభాస్కర్ ,వర్దన్న పేట శాసన సభ్యుడు ఆరూరి రమేష్ ,వరంగల్ ఈస్ట్ శాసన సభ్యుడు నన్నపనేని నరేందర్ ఈ భేటీ లో పాల్గొన్నారు . స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ,పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లతో సమావేశం నుంచే కె టి ఆర్ ఫోన్లో మాట్లాడారు .ఇలాంటి సమావేశాలతో ఇంకా మరింతమంది అభిప్రాయాలు తీసుకుని పార్టీ అధ్యక్షుడు ,సీఎం కెసిఆర్ కు నివేదించి వరంగల్ మేయర్ అభ్యర్థి పై తుది నిర్ణయం తీసుకుంటామని కె.టి .రామారావు సమావేశం లో తెలిపారు .