వరంగల్ సంస్థకు ఎన్నికలు జరిగినప్పుడు మేయర్ పదవి కోసం చాలామంది కార్పొరేటర్లు పోటీ పడిన విషయం తెలిసిందే జనరల్ అయినప్పటికీ నన్నపనేని నరేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేయడంతో అధిష్టానం మేయర్ పదవి విషయంలో నరేందర్ వైపు మొగ్గు చుపారు . ప్రస్తుతం నరేందర్ ఎమ్మెల్యే గా ఎన్నిక కావడంతో , మరోసారి మేయర్ పీఠం ఉత్కంఠ గా మారింది .
మొదటి నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సోదరుడు విజయభాస్కర్ మేయర్ పీఠం విషయంలో పోటీపడ్డారు . ప్రస్తుతం వినయ్ భాస్కర్ కూడా తమ్ముడి కోసం యువ నేత కేటిఆర్ , జాగృతి అధ్యక్షురాలు కవిత గారితో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే దాస్యం వినయ్ భాస్కర్ గారికి దాదాపు మంత్రి పదవి కంఫామ్ ఐన విషయం తేలిసిందె, ఈ సందర్బంగా మేయర్ పదవి ఎవరికీ ఇప్పిస్తారు అని చిన్న ఉత్కంఠ కొనసాగుతుంది …
మరోవైపు తెరాస రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ , మాజీ ఎంపీ గుండు సుధారాణి గారి కోడలు గుండు ఆశ్రితారెడ్డిని మేయర్ చేసెందుకు సుధారాణి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ రేసులో సుధారాణి పేరు వినిపించినా విషయం తెలిసిందే, తూర్పు టికెట్ సందర్బంగా తెరాస పార్టీ MLA అభ్యర్థికి గెలుపునకై తమ సహాయ సహకారాలు అందించాలని, ఎమ్మెల్యేగా నరేందర్ గెలిస్తే మేయర్ పదవి సుధారాణి కోడలుకు ఇస్తామని అధినేత కెసిఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.. నరేందర్ MLAగా గెలవడంతో సుధారాణి కోడలికి మేయర్ పదవి దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు …
వాస్తవానికి 2016 కార్పొరేషన్ ఎలెక్షన్స్ జరిగినప్పుడు మేయర్ పదవి విద్యావంతురాలు ఆశ్రితరెడ్డికి ( గూగుల్ to గ్రేటర్ ) అని రాష్ట్రం అంత ప్రచారం జరిగింది . చివరికి నన్నపునేని నరేందర్ ని వరించింది .
గూగుల్ లో సాఫ్ట్-వెర్ ఇంజనీర్ గా పనిచేసిన ఆశ్రితారెడ్డి సమాజ సేవ చేయాలనె కోరిక మేరకు వరంగల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలుపొందారు . ప్రస్తుతం మేయర్ తనకే కేటాయిస్తారు అని జిల్లాలో ప్రచారం జరుగుతుంది …
ఇదిలా ఉండగా మేయర్ పీఠం ఆశించే ఆశావహులు MLAలను ఇప్పటికే కలసి తమ అనుకూలతను తెలపాలని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ గుండు సుధారాణి శిష్యుడు ఐన విషయం తెలిసిందే . ఇద్దరి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధిష్టానంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న గుండు కుటుంబానికే మేయర్ అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.
ఏది ఏమైనా ఫైనల్ గా మాత్రం యువనేత KTR నిర్ణయం మేరకే మేయర్ ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నందున మేయర్ పోటీలో ఉన్న వద్దిరాజు గణేష్, నల్ల స్వరూపరాణి, డిప్యూటీ మేయర్ కాజా సిరాజుద్దీన్ మరియు ఇతర కార్పొరేటర్లు యువనేతను ప్రసన్నం చేసుకునేందుకు రాజధానికి ఖ్యు కడుతున్నారు..