తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ హైకోర్ట్ ని ఆశ్రయించారు. తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్హౌస్ను అధికారులు సీజ్ చేశారన్నారు. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరుగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సినీహీరో ప్రభాస్ గెస్ట్హౌస్ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.