నెహ్రూ జూపార్కులో చీతా శనివారం గుండెపోటుతో కన్నుమూసింది. పదకొండేళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటున్న మగ చీతా అబ్దుల్లా(15) మృత్యువాతపడటంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. వివరాలు: చార్మినార్‌: నెహ్రూ జూపార్కులో చీతా శనివారం గుండెపోటుతో కన్నుమూసింది. 11ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటున్న మగ చీతా అబ్దుల్లా(15) మృత్యువాతపడటంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు.

Advertisement

ప్రస్తుతం దక్షిణ భారతంలో మైసూర్‌తో పాటు నెహ్రూ జూలోనే చీతాలు ఉన్నాయి. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు జూను సందర్శించి, జూ నిర్వహణకు ముగ్ధులై 2012లో ఒక జత ఆడ, మగ చీతాలను జూకు పంపించారు. అప్పుడు వీటి వయసు నాలుగేళ్లు. ఆడ చీతా పన్నెండేళ్ల ప్రాయంలో (2020లో) అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి జూలో అబ్దుల్లా ఒంటరిగా ఉంటోంది. అబ్దుల్లా మరణంతో ప్రస్తుతం జూలో చీతాలు లేకుండా పోయాయి.