సోషల్ మీడియా అనేది ఇప్పుడు అందరి జీవితాలలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రతి ఒక్కరు తమ అలోచనలను, అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. మరి కొందరు అలాంటి వారి అలవాట్లు, పనులు నచ్చి వారిని ఫాలో అవుతుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే: మన దేశ ప్రధాని మోదీ కూడా ఒక అమ్మాయి చేసే మంచి పనులను చూసి ఫిదా అయిపోయారు. ఆయన కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ట్విట్టర్ అకౌంట్ను ఫాలో అవుతున్నారు. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే మైసూరు చెందిన 22 ఏళ్ల ప్రజ్ఞా కశ్యప్. ఈమె తన పదకొండేళ్ల వయసు నుంచే ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలలో బాధితులకు సహాయం అందించడానికి, పేద విద్యార్థులకు క్లాసులు, యవతకు ఫ్రీగా కోర్సులు అందిస్తుంటుంది.
స్టేజ్ల పై నృత్యం చేయడం, వీణ వాయించడం, బోమ్మలు గీయడం ఇలాంటి వాటన్నింటిలో ఆమె దిట్ట. అంతే కాకుండా ప్రతిరోజు ధ్యానం చేయనిదే ఇతర పనులు స్టార్ట్ చేయనంటుంది ఈ అమ్మాయి. ఇలా ఆమె చేసే ప్రతి పని సోషల్ మీడియాలో షేర్ చేస్తు అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మాయి లా చదువుతోంది. తన కుటుంబం ద్వారానే సమాజానికి ఏదైనా చేయాలని ఆసక్తి కలిగిందని ఆమె అంటోంది. అయితే మన దేశ ప్రధాని తన ట్విట్టర్ ను ఫాలో అవుతున్నందుకు ఆనందంగా ఉందని, తనను మరింతగా ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్యూ అంటోంది ఈ అమ్మాయి.
No words to express my happiness…. Humbled and honoured to be followed by our beloved PM @narendramodi ji
Thank you for this encouragement 🙏 pic.twitter.com/lrnGsYvfau— Prajna Kashyap (@KashyapPrajna) January 1, 2022