తమిళనాడులో కోయంబత్తూరులోని పట్టీశ్వర దేవాలయం సమీపంలోని దర్పణం మండపం, పడితుర ప్రాంతాల్లో 10కి పైగా గుర్రాలు తిరుగుతున్నాయి. ఆ ప్రాంతంలోనే పచ్చి గడ్డి మేస్తూ ఉంటున్నాయి. కాగా, వారం క్రితం ఓ పిల్ల గుర్రం మందలోని నుంచి తప్పిపోయింది. అది తల్లి గుర్రాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతమంతా తిరిగింది.
ఇదే సందర్భంలో ఓ బస్సుపై ఉన్న గుర్రపు బొమ్మను చూసింది. దీంతో, ఆ బొమ్మే తన తల్లి అనుకుంది. కాసేపు అక్కడే అటు ఇటూ తిరిగింది. ఇంతలో బస్సు స్టార్ట్ కావడంతో తన తల్లి పరిగెత్తుతుందనే భావనతో పిల్ల గుర్రం కూడా బస్సు వెంట పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, గుర్రాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా కంటతడి పెట్టించింది. వారంతా ఆవేదనకు లోనయ్యారు.
குதிரையின் பந்தபாசம்: பேருந்தில் ஒரு குதிரையின் படத்தை பார்த்து பின்னால் ஓடும் குட்டி குதிரை.
இடம்- கோயம்புத்தூர் | வீடியோ உதவி: பி.ரஹ்மான்#horse | #Kovai pic.twitter.com/W9m8QXlC0d
— Indian Express Tamil (@IeTamil) September 13, 2022