నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భౌతికకాయానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. అనంతరం తారకరత్న భార్య అలేఖ్యారెడ్డిని దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఈ క్రమంలో ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్రతుకుతో పోరాడావ్, చావుతో పోరాడావ్, నీ అలేఖ్యలో ఎప్పటికీ జీవించే ఉంటావ్, అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
బ్రతుకుతో పోరాడావ్.. చావుతో పోరాడావ్.. నీ అలైఖ్యలో ఎప్పటికీ జీవించే ఉంటావ్.#RestInPeaceTarakaRatna pic.twitter.com/xfqFAqYsoe
— YS Sharmila (@realyssharmila) February 19, 2023