ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఉదయం జరిగింది. చిల్కూరు మండలం జాంపహాడ్‌లోని దర్గాను దర్శించుకొని ఓ కుటుంబం ఆటోలు తిరిగి వస్తుండగా చిల్కూరు మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయ పడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామస్థులుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.