తాజాగా ఆది తన ప్రేమ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పేశాడు. బుల్లితెరపై హైపర్ ఆది కెరీర్ ఎలా ప్రారంభమైంది ఎలా ఎదిగాడన్నది అందరికీ తెలిసిందే. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి యూట్యూబ్‌లో స్పూప్‌లు చేసి ఫేమస్ అయ్యాడు. అలా ఓ సారి అత్తారింటికి దారేది సినిమా డైలాగ్‌ను స్పూప్ వేశాడు. ఆ వీడియోను అదిరే అభి చూసి ఆదికి జబర్దస్త్ షోలో అవకాశం ఇచ్చాడు. అదిరే అభి టీంలో హైపర్ ఆది ఓ కంటెస్టెంట్‌గా వచ్చాడు. రైటర్‌గా మారాడు అభి టీంకు వెన్నుముకగా మారిపోయాడు. అయితే రాను రాను అభి టీం అంటే ఆది అనే వరకు ఎదిగాడు. అయితే చివరకు ఆది కోసమే ఓ టీం ఏర్పాటు చేశాడు. తన గురువు అభికే ధీటుగా ఆది సక్సెస్ అయ్యాడు. జబర్దస్త్ షోకు హైపర్ ఆది టీం ఆయువుపట్టుగా మారింది. ఆది స్కిట్ల కోసమే జబర్దస్త్ షోను చూసే వరకు వచ్చింది. మధ్యలో ఆది ఢీ షో కోసం పని చేశాం. ఢీ షో రైటర్‌గా పని చేస్తూనే అందులో నటించేశాడు. ఆది వర్షిణి ట్రాక్ అప్పుడే క్లిక్ అయింది. ఆ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆది, వర్షిణి ప్రేమలో ఉన్నారనే రూమర్లు ఎక్కువయ్యాయి. యూట్యూబ్‌లో ఎక్కడ చూసిన వీరి మీద కథనాలు కనిపిస్తూ ఉండేవి. అయితే తామిద్దరం మాత్రం మంచి స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ రీసెంట్‌గా వర్షిణి వేసిన పోస్ట్, ఆదితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూసి అందరిలోనూ కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఆది ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద పెట్టేశాడు.

జబర్దస్త్ షోను ఆది వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం శ్రీదేవీ డ్రామా కంపెనీ మీదే దృష్టి పెట్టేశాడు. సుధీర్ వెళ్లిన తరువాత ఆ షో కాస్త కిందకు వచ్చింది. కానీ ఆది మాత్రం దాన్ని పైకి లేపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో వన్ మెన్ షో‌గా రెచ్చిపోయాడు. అందులోనే తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. అయితే అదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్టు అనిపిస్తుంది. ప్రేమ కావాలి హీరోయిన్ మీద తన ప్రేమను చెప్పేశాడు. ఈషా చావ్లా అంటే తనకు ఇష్టమని కొన్ని డైలాగ్స్ వేసేశాడు ఆది. ఏరా ఈషా ప్రేమ కావాలి వచ్చినప్పటి నుంచి ప్రేమిస్తున్నా ఎందుకురా సినిమాలు చేయడం లేదంటూ తన ప్రేమ గురించి చెప్పేశాడు. సినిమా వచ్చి పదకొండేళ్లైంది అప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అంటూ ఆది తన ప్రేమ గురించి చెప్పుకొస్తాడు. నాకు అందరిలా ప్రేమ గురించి చెప్పడం రాదు ఏడిస్తే చచ్చిపోతా చచ్చిపోతే గుంతలో పూడుస్తా అనే డైలాగ్స్ రావు అని రష్మీ సుధీర్ జోడి మీద కౌంటర్లు వేస్తాడు. అర్దరాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేశాడు.. గోడ దూకాడు అనేవి కూడా చెప్పడం రాదంటూ వర్ష ఇమాన్యుయల్ జంట పరువుతీశాడు.