జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ సూచించారు బుధవారం ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన పరిశీలకురాలికి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పుష్పగు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటర్లకు అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని సూచించారు . శాంతి భద్రతల దృష్ట్యా అవసరమైన చర్య తీసుకోవాలని ఎస్పీకి సూచించారు ఎన్నికల విధులను నిర్వర్తించేందుకు అవసరమైన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలింగ్ జరగనున్న అన్ని మండలాలకు
ఎన్నికల సామగ్రి తరలింపు గురించి అడిగి తెలుసు పరిశీలకున్నారు . ఎన్నికల తర్వాత కౌంటింగ్ కొరకు అనేక సమయం ఉన్నందున భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలన్నారు . అనంతరం పరిశీలకుల సమక్షంలో మొదటి విడత ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల రెండో స్థాయి, ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వ హించారు . అలాగే మెదక్ ఎంపీడీఓ కార్యాలయం జరుగుతున్న మొదటి విడుత నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు . ఎన్నికల నిర్వహణ , ఏర్పాట్లు సౌకర్యాలు తదితర విషయాల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు . ఈ సమావేశంలో కలెక్టర్ , ఎస్పీ చందనాదీప్తి , జాయింట్ కలెకర్ నగేష్ , డిప్యూటీ సీరట లమీబాయి , ఎన్నికల పరిశీలకులు పరశురాం , డీపీఓ తదితరులు పాల్గొన్నారు ..