గడిచిన 24 గంటల్లోనే రాజస్థాన్‌లో నాలుగు సాముహిక అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. ఇలా ఓ ఘటనలో రాష్ట్రంలోని మాల్‌పూర్ లో ఓ భర్త తన సొంత భార్యనే 5వేల రూపాయలు తీసుకుని ఇద్దరు బయటి వ్యక్తులకు అప్పగించాడు. భర్త ఒప్పందం ప్రకారం అయిదు వేల రూపాయలకు ఇద్దరు వ్యక్తులతో ఆమె గడపాలి. దీంతో డబ్బులు ఇచ్చిన వారు ఆమెకు తెలియకుండానే ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో వారితో గడపమని భర్త చెప్పడంతో ఆమె ఖంగుతింది, అందుకు నిరాకరించింది.

దీంతో భర్తతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెను విపరీతంగా కొట్టారు. అడ్డువచ్చి ఆమె కొడుకును కూడా విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత బయటి తీసుకుని వెళ్లారు. ఒప్పందం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఆమెపై బలాత్కారం చేశారు. కాగా ఈ సంఘటన గత వారం రోజుల క్రితం జరిగినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అత్యాచారం చేసిన వారి పేర్లతో సహా పోలీసులకు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కారులోనే అత్యాచారం:

మరోవైపు యూపీలో ఓ యువతిని సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్‌షిప్ చేసిన కృష్ణా అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు ఫ్రెండ్‌షిప్ పేరుతో బయటకు తీసుకువచ్చారు. అనంతరం కారులోనే బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు అత్యాచార సంఘటనను ఫోన్‌లో రికార్డు చేశారు. ఎవరికైన చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామాని బెదిరించారు. అయితే సంఘటన జరిగిన తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లిన యువతి ఫిర్యాదు చేసింది.