తీవ్రమైన కడుపునొప్పి అంటూ కూతురు బాధపడుతుండగా అది చూడలేని తల్లి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేశారు. ఇక రిపోర్ట్స్ రానే వచ్చాయి. అవి చూసిన వైద్యులు యువతి గర్భం దాల్చిందని చెప్పారు. దీనితో దెబ్బకు ఆమె తల్లి ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. అసలేం జరిగిందని కూతుర్ని అడిగిన తల్లికి ఆమె చెప్పింది విన్నాక దెబ్బ మీద దెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తేః: ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50ఏళ్ల వ్యక్తి ఇటుకల బట్టీలో రోజూవారి కూలీగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కోనేళ్ళు అంతా బాగానే సాగింది. అయితే క్రమంగా అతడిలోని దుర్మార్గపు కోణం ఒకటి బయటపడింది. కంటికి రెప్పలా చూసుకోవాలని కన్నకూతురిని వక్ర దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురుపై పలు సందర్భాల్లో తమ కామవాంఛను తీర్చుకున్నాడు. ఇలా 7నెలల పాటు కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.

ఈ క్రమంలోనే ఆమె ఓ రోజు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఆమెను పరీక్షించిన వైద్యులు యువతి ఏడు నెలల గర్భంతో ఉందని తేల్చారు. దీనితో షాకైన తల్లి అసలేం జరిగిందా అని యువతిని అడగ్గా నిజం బయటపడింది. ఈ దారుణంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన 6 రోజుల్లోనే న్యాయస్థానం దోషికి రూ. 53వేల జరిమానా జీవిత ఖైదు శిక్ష విధించింది.