విజయవాడలో దారుణం జరిగింది. ఓ కామాంధుడి వికృత చేష్టలకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వినోద్‌ జైన్‌ అనే కామాంధుడు బాలికను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక నిన్న సాయంత్రం అపార్ట్‌మెంట్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న బాలిక కామాంధుడి వేధింపులకు చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వినోద్‌ జైన్‌ను అదుపులో తీసుకున్నారు.