కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ముజాహిద్ నగర్‌లోఈ ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రలులు ఆందోళనతో అక్కడ ఇక్కడ వెతికారు. తెలిసినవారింటికి వెళ్లి వాకబు చేశారు. కానీ ఎక్కడ పిల్లల జాడ లేదు. దీంతో తమ ఇద్దరు చిన్నారుల్ని పక్కింటివాళ్ల కారులో విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ కన్నవారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కారులో డోర్ లాక్ అయి పిల్లలు ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు పదేళ్ల రియాజ్, ఐదేళ్ల మహ్మద్‌గా గుర్తించారు. అయతే తల్లిదండ్రులు మాత్రం చిన్నారుల మృతిపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు… నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పిల్లలు కనిపించకుండా పోవడంతో తప్పిపోయారంటూ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సమయంలో కారు వెనక సీటులో విగత జీవులుగా చిన్నారులు కనిపించడంతో మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి…