జిల్లాలోని మల్యాల మండలం సర్వాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. దీంతో ఆ ముగ్గరూ మృతి చెందారు. మృతులను స్వప్న, అహల్యశ్రీ, విన్నులుగా గుర్తించారు. స్వప్న భర్త మల్యాలలో లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తున్నారు. లేడీస్ ఎంపోరియానికి వెళుతున్నాని చెప్పి ఇంటి నుంచి పిల్లలతో బయలు దేరిన స్వప్న ఎంతకీ షాపుకు రాలేదని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో ముగ్గురి మృతదేహాలను కనుగొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.