9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అంగడి జయరాజ్ తమ కుమార్తెలను గురువారం సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించారు ఇటీవల మంథని నుంచి బదిలీపై వచ్చిన జడ్జి తమ కుమార్తెలు 10వ తరగతి చదువుతున్న జనహిత, 8వ తరగతి చదువుతున్న సంఘహితలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని, పూర్తి వివరాలు సేకరించాకే నమ్మకంతో పిల్లలను చేర్పిస్తున్నామన్నారు