హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న మూడు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన 3 బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.