హిమాచల్ ప్రదేశ్లోని కులూలో ఘోర ప్రమాదం జరిగింది. సైంజ్ లోయలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. షయిన్షార్ నుంచి సైంజ్ వైపు టూరిస్టులతో వస్తోన్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలో లోయలో పడిపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల్లో ఇప్పటివరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం లోయ కావడంతో బాధితులను వెలికి తీయడం, ఆసుపత్రికి తరలించడం కష్టతరంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది