మనస్తాపంతో ఆత్మహత్య

డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే రఘునాథపల్లి మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన సంధ్య (20) అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ సెకండియర్ పరీక్షలు రాసిన ఆమె, ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫైనలియర్‌కు అర్హత సాధించలేదు.

దీంతో తీవ్ర అవమానానికి గురైన సంధ్య, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంధ్య తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. స్థానికులు సైతం సంధ్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.