జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్ ప్రాంతంలో పూనం (పేరు మార్పు) తన కూమార్తె గీత (పేరు మార్పు), మరో కుమారుడుతో కలిసి జీవినం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గీత తాను నివసించే ప్రాంతంలోనే ఓ యువకుడు ప్రతాప్ ( పేరుమార్పు)తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇదే విషయం తన తల్లి పూనంకు సైతం తెలిసింది. ఇద్దరి ప్రేమనెు అంగీకరించి పెళ్లి చేసేందుకు పూనం ఒప్పుకుంది. దీంతో ప్రతాప్ తరచూ గీత ఇంటికి వచ్చేవాడు. అయితే ప్రతాప్ పై గీత తల్లి పూనం కన్నేసింది. అంతేకాదు వరుసకు కాబోయే అల్లుడు అని తెలిసి కూడా తన దుర్బుద్ధి మార్చుకోలేదు.

అతడిని తన దారిలోకి తెచ్చుకోవాలని అతడితో సన్నిహితంగా ఉండేది. గీత ఇంట్లో లేని సమయంలో ప్రతాప్‌ను రమ్మని ఆహ్వానించేది. తనతో కావాల్సిన కోరికలు తీర్చుకోమని పరోక్షంగానే సిగ్నల్స్ సైతం ఇచ్చేది. ఇదంతా గ్రహించిన ప్రతాప్ మొదట్లో పూనం ప్రవర్తనకు కాస్త సందేహపడ్డప్పటికీ, ఆ తర్వాత ఆమెకు లొంగిపోయాడు. ఇద్దరూ ఇంట్లోనే శారీరక బంధానికి తెర లేపారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇద్దరూ రాసక్రీడల్లో మునిగితేలడం ప్రారంభించారు.

ఇదిలా ఉంటే గీతకు తన తల్లిపై అనుమానం కలిగింది. ఒక రోజు మధ్యాహ్నం సమయంలో చెప్పకుండా ఇంటికి వచ్చి పరిస్థితి గమనించేందుకు కిటికీలో నుంచి పరిశీలనగా చూసింది. అక్కడి సీన్ చుసి షాక్ తిన్నది, తన తల్లితో ప్రియుడు ప్రతాప్ ఒకరిలో ఒకరు ఒదిగిపోయి శృంగార భంగిమలో చూడగానే గీత మతిపోయింది. ఆ తర్వాత గీత కలత చెంది వెంటనే ప్రతాప్ కుటుంబ సభ్యులను పిలిచింది. అలాగే చుట్టుపక్కల వాళ్లు కూడా రావడంతో అంతా కలిసి ఇద్దరినీ నిలదీశారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి పరస్థితిని అదుపులోకి తెచ్చారు…