నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. మరికొన్ని గంటల్లో పెళ్లనగా పెళ్లింట విషాదం నెలకొంది. ముహూర్త సమయం దగ్గరపడుతుండటంతో ఎటుచూసినా కుటుంబసభ్యులు, బంధువుల హడావుడి కనిపిస్తోంది. ఇంతలో ఒక్కసారిగా అలజడి. రూంలోకి వెళ్లిన వధువు రవళి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన నవీపేట్ మండలం కేంద్రంలో ఓ పెండింట్లో జరిగింది. పెళ్లికి ముందు అబ్బాయి టార్చర్ వల్లే తమ కూతురు చనిపోయిందని నవ వధువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రవిళికి సంతోష్ తో ఆగష్టు 21న నిశ్చితార్థం చేశారు.

ఈరోజు నిజామాబాద్ లోని జనార్థన్ గార్డెన్స్ లో 12.15 గంటలకు వివాహం చేయడానికి నిర్ణయించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కూతురు మృతితో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది. తమ కూతురు పెళ్లి చేసుకొని సంతోషంగా అత్తారింటికి వెళ్తుందని ఎంతో సంబరపడిన ఆ తల్లిదండ్రులు స్మశాన వాటికకు వెళ్తున్నావా అంటూ రోదిస్తున్నారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది.