భద్రాద్రి కొత్తగూడెం: మరికాసేపట్లో పెళ్లనగా పెళ్లి కొడుకు కనిపించకుండాపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం పెళ్లికి ముహుర్తం దగ్గరపడుతున్నా పెళ్లికొడుకు కళ్యాణ మండపానికి చేరుకోలేదు. అనుమానం వచ్చి పెళ్లికొడుకుకి ఫోన్‌ చేస్తే రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నాడు. చివరగా పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పాడు. దీంతో పెళ్లిపీటలపైనే ఆ యువతి కన్నీటిపర్యంతమైంది. ఏం చేయాలో తెలియక న్యాయం కోసం పెళ్లి బట్టలతోనే చర్ల పోలీసులను ఆశ్రయించింది.