మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది . రాత్రి పూట ఓ వ్యక్తిని సిగరెట్ కావాలని అడిగి, అతడ్ని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుర్మార్గులు. అంతే కాదు, అతడ్ని శారీరకంగా హింసించి, వెనుక నుంచి ఎండిన కొబ్బరి చిప్పను శరీరం లోపలికి దూర్చారు. నవీ ముంబైలోని వసీలో రాత్రి 9 గంటలకు ఓ వ్యక్తి ( 36 ) ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా సాగర్ విహార్ లేక్ వద్ద అతడ్ని ఆపి సిగరెట్ అడిగారు కొందరు డ్రగ్స్ కు బానిసలైన వ్యక్తులు .

ఇంతలో, అతడ్ని కిడ్నాప్ చేసి చెట్ల చాటుకు తీసుకెళ్లి దారుణంగా రేప్ చేశారు . అనంతరం అతడి పురుషాంగంపై దాడి చేసి , వెనుక భాగం నుంచి లోపలికి ఓ కొబ్బరి చిప్పను దూర్చి పరారయ్యారు . తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడ్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు , పోలీసులకు సమాచారం అందించారు . వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . వైద్యులు అతడికి సర్జరీ చేసి కొబ్బరి చిప్పను తొలగించారు .

ప్రస్తుతం బాధితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు . ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ కు బానిసలుగా మారిన 25 – 30 ఏళ్ల యువకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు . ఘటన జరిగిన ప్రాంతంలోని CCTV ఫుటేజీలను పరిశీలిస్తున్నారు..