గత శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది . పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలికకు తొమ్మిది నెలలు నిండాయని ప్రసవం చేశారు . ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది . అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదని , బిడ్డ పుట్టిందని తెలిస్తే సమాజంలో పరువు పోతుందని శిశువును అక్కడే వదిలి వెళ్లేందుకు సదరు మైనర్ బాలిక ప్రయత్నించింది .

బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి తండ్రితో కలిసి బయటకు వెళ్లేందుకు యత్నిచింది . గమనించిన ఆస్పత్రి సిబ్బంది వారిని బందించి పోలీసులకు సమచారం ఇచ్చారు . పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలిక తండ్రిని విచారించారు . అయితే కూతురు గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని , కడుపు నొప్పి అని ఆస్పత్రికి తీసు కొచ్చానని బాలిక తండ్రి వివరించారు . బాలికను విచారించగా తనకు ఇంకా పెళ్లి కాలేదని , ఆ బిడ్డను తీసుకెళ్లనని తేల్చి చెప్పింది.

శిశు సంక్షేమ కమిటీ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చినా, బాలిక తన నిర్ణయాన్ని మార్చుకోలేదు . ఈ ఘటనపై శిశు సంక్షేమ కమిటీ సభ్యులు డీఎన్ శర్మ మాట్లాడుతూ: తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సమాజంలో పరువు పోతుందని బిడ్డను తీసుకెళ్లడం లేదని బాలిక చెబుతోంది . కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తాను మారడం లేదు . బిడ్డను తీసుకెళ్లడం ఇష్టం లేకపోతే రెండు నెలల తర్వాత మేమే శిశు సంక్షేమ సెంటర్ కి తీసుకెళ్తాం . కావాల్సిన వారికి దత్తత ఇస్తాం ‘ అని పేర్కొంది .