{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643008489481","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"version":1,"sources":[]}","premium_sources":[],"fte_sources":[]}

ఒక మైనర్ బాలిక వరసకు బావ అయిన యువకుడిని ఇష్టపడింది అతనికి కూడా ఈమె అంటే ఇష్టం. అయితే ఆ వ్యక్తికి మరొకరితో పెళ్లి అయిపోయింది. అయినప్పటికీ సరే ప్రేమించిన ఆ మైనర్ బాలికని పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాడు. ఇంట్లో ఈ విషయం తెలిసింది, పెద్దలు మాత్రం ఇలా చేయడం సరి కాదని చెప్పేశారు. వివరాల్లోకి వెళితే: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గల వనపర్తి జిల్లా, రేపల్లె మండలం గుడిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ళ క్రిందట అచ్చం పేట గ్రామానికి చెందిన అమ్మాయితో నరేష్ పెళ్లి అయ్యింది. వీరికి ఆరు నెలల పాప కూడా ఉంది. కానీ నరేష్ నాలుగేళ్ల నుంచి కూడా కల్వకుర్తి పట్టణానికి చెందిన యువతితో ప్రేమ లో ఉన్నాడు. ఈ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. ఈమె నరేష్ భార్యకి చెల్లెలు అవుతుంది.

వీళ్లిద్దరూ కూడా నాలుగేళ్ల నుంచి ప్రేమలో మునిగిపోయారు. గతంలో ఈ విషయం పెద్దలకి తెలిసి గొడవలు కూడా అయ్యాయి. అయితే పెద్దలు ప్రేమని అర్థం చేసుకోవడం లేదని ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నరేష్ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఇరువురు కూడా పెద్దలు ప్రేమని అంగీకరించడం లేదని గుడిపల్లి జలాశయంలో దూకేశారు. అయితే ఒడ్డున ఒక సెల్ ఫోన్ ఉంది. అందులో ప్రేమని అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని ఒకరికి మెసేజ్ పంపారు. వీళ్ళ కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గత రెండు రోజుల నుండి కూడా గాలింపు చర్యలు చేపట్టగా, ఆఖరికి మృతదేహాలు దొరికాయి. సాయంత్రం మూడు మోటార్లతో నీటిని తోడించి వెతకగా ఆఖరికి రాళ్ల మధ్య రెండు మృతదేహాలు లభించాయి. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.