ల‌ష్కర్‌పై ఈసారి గులాబి జెండా ఎగుర‌వెయ్యడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటి చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. గూలాబీ అధినేత కేసీఆర్ 16 స్థానాలకు అభ్యర్థుల‌ ప్రకటించారు. కాగా చిట్ట చివరగా టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్న నామా నాగేశ్వరావు, వేమిరెడ్డి, వెంకటేష్ నేతకాని కూడా బీఫాంలు లభించాయి.

ఇక అభ్యర్థులు వీరే –

చేవెళ్ల- రంజిత్ రెడ్డి

సికింద్రాబాద్- తలసాని సాయికిరణ్ యాదవ్

ఆదిలాబాద్‌- నగేష్

వరంగల్- పసునూరి దయాకర్

మహబూబాబాద్- మాలోతు కవిత

మల్కాజిగిరి- మర్రి రాజశేఖర్ రెడ్డి

ఖమ్మం- నామా నాగేశ్వరరావు

కరీంనగర్- బోయినపల్లి వినోద్ కుమార్‌

మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్‌రెడ్డి

నాగర్‌కర్నూల్- పి.రాములు

పెద్దపల్లి- నేతకాని వెంకటేష్‌

నిజామాబాద్- కల్వకుంట్ల కవిత

మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి

జహీరాబాద్- బీబీ పాటిల్

నల్గొండ- వేమిరెడ్డి నర్సింహారెడ్డి

భువనగిరి- బూర నర్సయ్య గౌడ్