{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643008489481","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"sources":[],"version":1}","premium_sources":[],"fte_sources":[]}

ఆస్పత్రిలో ఓ నవజాత శిశువుకు బీసీజీ టీకా వేయడానికి అక్కడ ఏఎన్ఎం డబ్బులు డిమాండ్ చేయడంతో ఆశా కార్యకర్త తిరగబడింది. దీంతో ఇరువురూ జుట్లు పీక్కున్నారు. రూ.500 కోసం ఆశా కార్యకర్త, ఏఎన్ఎం ఒకరిపై ఒకరు దాడిచేసుకుని, జుట్లు పీక్కున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలోనే చెప్పులతో కొట్టుకుని బాహాబాహీ తలపడిన ఈ ఇద్దర్నీ ఓ వ్యక్తి అతి కష్టంతో విడిపించాడు. బిహార్‌లోని జమౌ జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు: ఓ నవజాత శిశువుకు బీసీజీ టీకా కోసం ఆశా కార్యకర్త రింటు కుమారి ఆదివారం నాడు పీహెచ్‌సీకి తీసుకొచ్చింది.

అక్కడ ఏఎన్ఎం రంజన కుమారి టీకా వేయడానికి రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆశా కార్యకర్త ఆమెతో వాగ్వాదానికి దిగారు. చినికి చినికి గాలివానలా మారినట్టు ఈ వాగ్వాదం క్రమంగా పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. మెటర్నిటీ వార్డు సమీపంలో ఇద్దరూ జుట్లు పీక్కుని, కొట్టుకున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే, ఇప్పటి వరకూ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఆస్పత్రిలోనే ఇద్దరు ఉద్యోగులు ఇలా ప్రవర్తించడంతో తీవ్రంగా పరిగణించారు. కాగా, ఇటీవల జాముయిలోనే ఓ ఏఎన్ఎం విధులకు హాజరుకాలేదనే కారణంతో ఆస్పత్రి సిబ్బంది ఒకరు ఆమెనై దాడికి పాల్పడిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసింది.