పెట్రోల్ బాటిల్ ప్రస్తుతం ఎంత హడల్ ఎత్తిస్తుందో

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహశీల్దార్ కార్యాలయానికి ఒక రైతు పెట్రోల్ డబ్బాతో రావడంతో తహశీల్దార్ కార్యాలయ సిబ్బందిని హడలెత్తించింది. కార్యాలయం లోపల ఉన్న సిబ్బంది అంతా ఒక్కసారిగా బయటకి పరుగులు తీయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే చంద్రయ్య వచ్చింది పెట్రోల్ తో దాడి చేయడానికి కాదు తన భూమి విషయం ఆరా తీయడానికి వచ్చాడని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చంద్రయ్య అనే రైతు ఒక వ్యక్తి దగ్గర 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు.

కొనుగోలు చేసిన భూమిని తన భార్య పేరు మీద రిజిష్టర్ చేయించుకోవాలని చంద్రయ్య తహశీల్దార్ కు ధరఖాస్తు చేసుకున్నాడు. తహశీల్దార్ ఆఫీస్ లో తన ధరఖాస్తు గురించి తెలుసుకోవటానికి వచ్చాడు. అయితే విషయం తెలియని రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఇలా హడలెత్తిపోయారు. అయితే ఆ రైతుని పెట్రోల్ బాటిల్ తో కార్యాలయంలోకి ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించగా తన గ్రామంలో పెట్రోల్ దొరకదని, తన వాహనానికి అవసరమైన పెట్రోల్ ఎప్పుడు పట్నం వచ్చినా ఇక్కడే కొనుగోలు చేసి తీసుకెళ్తానని తాపీగా చెప్పుకొచ్చాడు. చూసారా u..!