అనంతపురం నూతన కాలువలు చెందిన పడిగిపాలెం రిజ్వానా (23) కు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సర్దార్‌తో కొన్నేళ్ల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సజావుగా సాగిన వీరి కాపురంలో అక్రమ సంబంధం పెను వివాదానికి దారితీసింది. కొన్ని నెలల క్రితం నుంచి రిజ్వానా హర్షవర్ధన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. విషయం బయకు పొక్కడంతో భర్త, ఇంట్లోని పెద్దలు మందలించారు. కానీ, ఎవరు ఎంత చెప్పినా రిజ్వానా వినిపించుకోలేదు. కొన్ని నెలల క్రితం ప్రియుడు హర్షవర్ధన్‌తో కలసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం అన్ని ప్రాంతాల్లో గాలించిన కుటుంబ సభ్యులు చివరకు 10రోజుల క్రితం బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. పంచాయితీ పెట్టి భర్తతో కాపురం చేసుకోవాలని పెద్దలు సూచించారు.

భర్త కూడా ఆమె తప్పును మర్చిపోయి కాపురం చేద్దామని చెప్పడంతో అంతా సర్దుమణిగింది. అప్పటి నుంచి ఆమె తన భర్తతో కలిసి పులివెందులలో ఉంటున్నారు. అయితే అప్పటి నుంచి ఆమె హర్షవర్ధన్‌ను దూరం పెట్టేసింది. అతడితో పూర్తిగా మాటలు లేవు. దీంతో రిజ్వానాపై ఆగ్రహంతో రగిలిన పోయిన హర్షవర్ధన్, ఆమెను చంపేయాలని ఫిక్సయ్యాడు. ఈ క్రమంలో రిజ్వానా, ఆమె భర్త నిత్యావసర సరుకులు తెచ్చేనందుకు వెళ్లారు. అదే సమయంలో దుకాణంలోకి వెళ్లిన హర్షవర్ధన్ రిజ్వానాపై కత్తితో దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడే మృతి చెందింది. అదే ఘటనలో ఆమె కుమార్తె మొగిషీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.