భార్య ఖర్చులు, వేధింపులను తట్టుకోలేని భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. మృతుడు 39 సంవత్సరాల శ్రీనాథ్‌ అని, ఇతను నగరంలోని ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఇతని భార్య రేఖ ఫ్లాట్‌ కొనటానికి, ఇంకా ఇతర విలాసాల కోసం లోన్లు తీసుకున్నట్టు తెలియవచ్చింది. ఎన్నిసార్లు మందలించినా వినని రేఖ విపరీతంగా ఖర్చుచేసేదని పోలీసులు వివరించారు. అంతే కాకుండా ఆమె భర్తను తరచు వేధింపులకు గురిచేసేదని, ఆస్తిని తన తండ్రి పేరు మీద రాయమని భర్తను ఒత్తిడి చేసేదని వారు తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు రేఖ, ఆమె తల్లితండ్రుల మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నామని నగర పోలీసులు చెప్పారు…