జోలదరాసి గ్రామంలో వడ్డే వెంకటేశ్వర్లు, వడ్డే వెంకటసుబ్బయ్య కలిసిమెలిసి ఉండేవారు. పలుమార్లు ఇద్దరు కలిసి మద్యం సేవించేవారు. దీంతో ఇద్దరు అప్పులు కూడా ఇచ్చి పుచ్చుకునేవారు. వెంకటసుబ్బయ్య వద్ద వెంకటేశ్వర్లు వంద రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సుబ్బయ్య పలుమార్లు వెంకటేశ్వర్లను డబ్బులివ్వమని అడిగాడు. రేపు ఇస్తా మాపు ఇస్తానని పలుమార్లు వాయిదా వేశాడు. వెంకటేశ్వర్లను మద్యం మత్తులో ఉన్న సుబ్బయ్య డబ్బులివ్వమని అడిగాడు.

వంద రూపాయల కోసం ఎక్కడ పడితే అక్కడ అడుగుతావా? అని ఆగ్రహించాడు. దీంతో ఇద్దరు వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇద్దరు కొట్టుకున్నారు. సుబ్బయ్య కిందపడిపోయిన వెంటనే వెంకటేశ్వర్లు పంచెను లాగాడు. పంచె ఊడిపోవడంతో వెంకటేశ్వర్లు మర్మాంగాన్ని సుబ్బయ్య గట్టిగా కొరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన వెంకటేశ్వర్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లను ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.