ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో పుప్పురెడ్డి రఘు (16), ఓరం ప్రశాంత్(25) అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. తాడ్వాయి ఎస్సై రవీందర్ తెలిపిన

వివరాలు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని అరుణసాగర్ కు చెందిన స్నేహితులు మేడారం జాతర లో బ్రాంది షాపు పెట్టడానికి స్థలం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చారు. వనదేవతల దర్శనానికి పుణ్యం స్నానాలు ఆచరించడానికి జంపన్న వాగు లో దిగారు. గతంలో తుఫాను తాకిడికి వాగులో గోతులు ఏర్పడ్డాయి. పై ఇరువురు అందులో పడి గల్లంతైయ్యారు. వెంటనే తాడ్వాయి ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో పోలీసు లు గాలింపు చర్యలు చేపట్టారు.

కానీ వారి ఆచూకీ తెలియలేదు. గల్లంతైన ఇద్దరిలో ఓరం ప్రశాంత్ సింగరేణిలో ఉద్యోగి.a