దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలను తెరకెక్కించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఈ దర్శకుడు అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో చంద్రలేఖ సినిమా సమయంలో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులు ప్రస్తుతం తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ దంపతులకు ఓ కొడుకు కూడా జన్మించాడు. ఇక ప్రస్తుతం కెరియర్లో కృష్ణవంశీ దర్శకుడిగా సినిమాలు చేస్తూ వెళ్తుంటే. రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఆగ్రహీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక దర్శకుడుగా కృష్ణవంశీ అప్పటికంటే ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించినప్పటికీ మరికొద్ది రోజుల్లోనే ‘రంగమార్తాండ’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన కృష్ణవంశీ పలు ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక రంగమార్తాండ సినిమాలో ప్రకాష్, రాజ్ అనసూయతో పాటు రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ మరోసారి రమ్యకృష్ణతో విభేదాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు కృష్ణవంశీ మాట్లాడుతూ: ప్రస్తుతం ఇద్దరం కూడా సినిమా పనులతో బిజీగా ఉన్నామని అలాగే రమ్యకృష్ణ ప్రస్తుతానికి చెన్నైలో ఉంటుందని, తాను మాత్రం హైదరాబాదులో ఉంటున్నానని చెప్పాడు. అయితే తాము ప్రస్తుతానికి తమ వృత్తిపరంగా విడిగా ఉన్నామే తప్ప ఎటువంటి విడాకులు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ. అంతే కాకుండా ఇలాంటి వార్తలను సృష్టించడం అనేది ఒక శాడిస్ట్ పని అని తన అభిప్రాయం తెలియజేసారు..