మాస్కో: రష్యాలో విషాదం జరిగింది. క్రిమియాలోని సింఫరోపోల్‌లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. కారు సెర్గీవ్ నుంచి సెన్‌స్కీ వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.