రేణిగుంట పట్టణంలో గత కొన్నేళ్లుగా రవిచంద్ సూరి(55), వసుంధర (45) దంపతులు నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ఈ వయసులో కూడా భర్త సూరి వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఓ భర్త అక్రమ సంబంధాన్ని భార్య ప్రశ్నించింది. దీంతో వారి మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా దూషించుకునేవరకు వెళ్లింది. ఇంట్లో మతి స్థిమితం లేని కుమారుడ్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఇలాంటి పనులేంటని నిలదీసింది. ఇలా మాట మాట పెరిగి గొడవ కాస్త శృతి మించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భర్తపై కోపంతో ఊగిపోయిన భార్య వసుంధర ఒక్కసారిగా భర్త రవిచంద్ సూరి పై దాడి చేసింది.

తాను ఏం చేస్తున్నానో మరిచిపోయిన కత్తితో అత్యంత క్రూరంగా గొంతు కోసి తల మొండెంను వేరు చేసింది. కసితీరా చంపేశాక ఆ తలను తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయింది. మహిళ భర్త తలతో రావడం చూసి పోలీసులే షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంభందమే హత్యకు కారణమైనట్లుపోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులో ఉన్న భార్య వసుంధరను విచారణ చేస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని రేణిగుంట సర్కిల్ సిఐ అంజు యాదవ్ తెలిపారు. వసుంధర భర్త తలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపయింది. ఐతే భర్తకు తగిన శాస్తి జరిగిందని కొందరంటుంటే భర్త చనిపోవడం, భార్య జైలు కెళ్లడంతో మతిస్థిమితం లేని వారి కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.