హుజూర్నగర్ పట్టణంలోని మఠంపల్లి బైపాస్ రోడ్డులో గల వెంకటేశ్వరస్వామి గుడి వద్ద స్కూటీని టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటనలో ఒక మహిళా ఉపాధ్యాయురాలు మృతి చెందింది. యస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హుజూర్నగర్లో నివాసముంటున్న కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన గుద్దేటి కమలకుమారి(35) మఠంపల్లి మండలం భీమ్లాతండా ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.
బుదవారం సాయంత్రం విధులు ముగించుకుని తన సహచర ఉపాధ్యాయురాలు భవానికి చెందిన స్కూటీపై హుజూర్నగర్కు వస్తుండగా వెనక నుండి టిప్పర్ ఢీకొనడంతో కింద పడి తీవ్ర గాయాలపాలై కమల కుమారి అక్కడికక్కడే మృతి చెందగా మరొక ఉపాధ్యాయురాలు భవాని స్వల్పంగా గాయపడింది. ఆమెను స్ధానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మృతిరాలి భర్త రవి కోదాడలో ఓ ప్రవేట్ స్కూల్లో పని చేస్తున్నారు. భర్త ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కమల కుమారి మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు ఆసుపత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. టీచర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.