వరంగల్: వెంకటాపురం మండల పరిధిలోని అంకన్నగూడెం గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీ దగ్ధమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం: బుధవారం రాత్రి రామచంద్రాపురం ఇసుక రీచ్ నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు లారీ అక్కడికి వచ్చింది. కాగా గురువారం తెల్లావారుజామున లారీ మంటల్లో కాలిపోయింది. లారీకి ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లారీకి మంటలు ఎలా అంటుకున్నాయనే విషయంపై పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం.