విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వరంగల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా వరంగల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మట్టేవాడ ప్రభుత్వ పాఠశాలలో పోశాల శ్రీనివాస్‌ చిన్నారులను వేధింపులకు గురి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఉపాధ్యాయుడిని చితకబాదారు. అతనిపై వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.