భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నేతల సవాళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు భూపాలపల్లిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే చట్టప్రకారం చర్యలుంటాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి హెచ్చరించారు. ఈ సవాల్ కు కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ స్పందిస్తూ కచ్చితంగా రుజువు చేస్తామన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భూపాలపల్లిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.