ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై ఇంటి యజమాని కన్నేశాడు, ఎవరూ లేని సమయంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు . ఈ సంఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది. కాగా, ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడం గమనార్హం . బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది . దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు .

పోలీసులు యజమాని శివప్రసాద్ ను ( 36 ) బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు . బాధిత కుటుంబ సభ్యులు పిల్లలతో సహా మూడేళ్లుగా ఆనంద్ బాగ్ కు చెందిన శివప్రసాద్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో శివప్రసాద్ ఆ మహిళను ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించాడు . ఈ నెల 12న ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారం జరిపాడు . బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు…